Ultimate magazine theme for WordPress.

మీ మనిషిగా నన్ను ఆశీర్వదించండి. జూలకంటి రంగారెడ్డి

Post top
home side top

ప్రజల మనిషిగా నన్ను ఆదరించండి.

 

* ప్రచారంలో సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి

 

ప్రజాలహరి మిర్యాలగూడ

 

 

నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంగా పనిచేస్తున్నానని ప్రజల మనిషిగా నన్ను గుర్తించి ఆదరించి అసెంబ్లీకి పంపాలని సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు శనివారం మండలంలోని

గూగులోతు తండా, మైసమ్మ కుంట, వాటర్ ట్యాంక్ తండా, చిల్లాపురం, కుంట కింద తండా,

ఐలపురం, వేంకటాద్రి పాలెం, లంచ్ వేంకటాద్రి పాలెం, లావుడి తండా, తుంగపహాడ్, జప్తి వీరప్ప గూడెం, బల్లు నాయక్ తండా అన్నారం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు ప్రజలు స్వచ్ఛందంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎత్తున ఎదురొచ్చి హారతులు పూలదండలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నానని ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు పనిచేసే నాయకుని ఎన్నుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఎన్నికల్లో సునామీల తీర్పు రాబోతుందని చెప్పారు తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి తాను అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆరోపించారు సేవ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను మోసం చేసినందుకు చూస్తున్నాడని వార్డును అభివృద్ధి చేయని నాయకుడు ఎమ్మెల్యేగా ఏం పని చేస్తాడని విమర్శించారు డబ్బు బలంతో గెలవాలని చూస్తున్న నాయకులను ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ధన బలం ముందు ప్రజాబలం గెలుస్తుందని చెప్పారు తన గెలుపును ఎవరు ఆపలేరని వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి అధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తానని ప్రభుత్వ మెడలు వంచి నియోజవర్గ అభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్,మంగా రెడ్డి, బాబు నాయక్ ఆయా గ్రామాల కార్యదర్శలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.