
అభివృద్ధి చేసే విషయంలో వెనకడుగు వేసేది లేదు.. భాస్కరరావు… మిర్యాలగూడ ప్రజా లహరి …..ఎన్నికలవేళ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి భాస్కరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .ఈరోజు 29వ వార్డులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేసే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 29వ వార్డుకు ఐదు కోట్ల రూపాయలతో రహదారులు ఇతరత్రా వర్క్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ అభివృద్ధి విషయాలను గమనించాలని కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. 30 ,31, 32 ,12 ,13, వార్డులలో సుమారు 25 కోట్ల రూపాయలతో రహదారులు డ్రైనేజీలు మెరుగు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సీతారాంపురం -బంగారు గడ్డను కలిపే బ్రిడ్జిలను కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు