
బ్రాహ్మణ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంది ఎమ్మెల్యే భాస్కర్ రావు….
మిర్యాలగూడ ప్రజాలహరి…
తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భాస్కరరావు పేర్కొన్నారు. ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులు ఉన్న మూడు శాఖలకు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అనేకమంది యువతకు ఉపాధి అవకాశాలు రుణ సాయం ఉన్నత విద్యకు విద్య కోసం ఆర్థిక సాయం అందించిందని చెప్పారు అదేవిధంగా ధూప దీప నైవేద్యాల పథకం అమలు చేసి బ్రాహ్మణులకు ఆర్థిక తోడుగా నిలిచిందని వివరించారు బ్రాహ్మణ పరిషత్ లో అర్హులైన పేదవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సౌభాగ్య లక్ష్మి, గృహలక్ష్మి, వృద్ధాప్య పెన్షన్ వంటి పథకాలు రాబోవు ప్రభుత్వం అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం స్థానికంగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు భవిష్యత్తులో తాను వారికి అంటగా ఉంటానని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ బ్రాహ్మణ సంఘం నాయకులు కృష్ణమూర్తి శర్మ, పి లక్ష్మీనారాయణ శర్మ, వేణుగోపాలరావు గిరి, టీ రామచంద్ర రావు ,రాధాకృష్ణ శర్మ లోకాచార్యులు, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ శర్మ, బోయినపల్లి వెంకటరమణారావు, కొప్పోలు వెంకటేశ్వరరావు ,మామిడాల సురేష్ బాబు, బోయినపల్లి రామకృష్ణ రావు chityala శ్రీనివాసరావు, భైరవబాట్ల రాంబాబు శర్మ, తదితరులు పాల్గొన్నారు