Ultimate magazine theme for WordPress.

రేవంత్ రెడ్డి ,బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరినమాజీ ఎమ్మెల్సీ భారతి నాయక్ స్కైలాబ్ నాయక్

Post top
home side top

స్వర్గీయ రాగ్యా నాయక్ ధర్మపత్ని మాజీ ఎమ్మెల్సీ భారతి రాగ్య నాయక్ వారి కుమారుడు, స్కైలాబ్ నాయక్ లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక…..మిర్యాలగూడ ప్రజాలహరి….

 

మిర్యాలగూడ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యా నాయక్ వారి కుమారుడు స్కైలాబ్ నాయక్ , దామరచర్ల మండల ఎంపీపీ నందిని రవితేజ లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో వారు చేరారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు నల్గొండ జిల్లాలో గిరిజనులలో పట్టు ఉన్న నేతలు మాజీ ఎమ్మెల్సీ దిరావత్ భారతీ రాగ్యనాయక్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్ దామరచర్ల మండలం ఎంపీపీ నందిని రవితేజ దామరచర్ల మండలం చెందిన బాండవత్ తండా గ్రామ సర్పంచ్ మరో ఐదుగురు మాజీ సర్పంచులు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారందరూ శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ వీరి చేరికతో మిర్యాలగూడ నియోజకవర్గంలో పాటు నాగర్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గం ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందురు రఘువీర్ రెడ్డి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ,మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి , టీపీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య,బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.