
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిదేవులపల్లి మండలంలోని *దుద్య తండా నుంచి ప్రారంభమై వస్రం తండా, చాంప్ల తండా, గొన్య తండా, బంజారా తండా* గ్రామాలలో పర్యటించడం జరిగింది . మధ్యాహ్నం స్వల్ప విరామం తర్వాత తిరిగి ప్రారంభం అవుతుంది అని తెలిపారు .. అడుగడుగునా గిరిజన ప్రజలు పలుకుతున్న నీరాజనాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.. గిరిజన ఆడపడుచులకు నాకు అన్న, చెలెళ్ల అనుబంధం ఉంది.. ఎలాంటి ప్రేమ ఆదరాభిమానాలు దొరకడం నా పూర్వ జన్మ సుక్రతం అని అన్నారు . ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్ , మండల పార్టీ ప్రెసిడెంట్ బాలు నాయక్, సర్పంచులు, ఎంపీటీసీ లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.