
భాజపా సాధినేని శ్రీనివాస్ రావు నామినేషన్… మిర్యాలగూడ ప్రజాలహరి…. నామినేషన్లు చివరి రోజు కావడంతో భారతీయ జనతా పార్టీకి చెందిన సాదినేని శ్రీనివాసరావు ఈరోజు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు వేశారు ముందుగా ఆయన నియోజకవర్గ భాజపా కార్యకర్తలు అభిమానుల ర్యాలీలతో నిర్వహించి ప్రజలకు అభివాదం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తారని ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని ఎస్సీ రిజర్వేషన్ లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని ఆయన పేర్కొన్నారు ఆయన వెంట భాజపా నాయకులు కర్నాటి ప్రభాకర్, రతన్ సింగ్ నాయక్, పురుషోత్తం రెడ్డి, అశోక్ రెడ్డి హనుమంత రెడ్డి ,రమేష్ తదితరులు పాల్గొన్నారు