
ఎన్నికల సందర్భంగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినప్పటికీ.. .. రెండవ నిబంధనలను అతిక్రమించి మరోసారి ఘర్షణకు దిగిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇంజమూరి కొండల్ కు మిర్యాలగూడ తాసిల్దార్ హరిబాబు రూ లక్ష జరిమానా విధించినట్లు ఒకటో పట్టణ సిఐ రాఘవేందర్ తెలిపారు. మంగళవారం తాసిల్దార్ కార్యాలయంలో .. పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నిందితుడు ఇంజమూర్ కొండల్ ను తాసిల్దార్ ఎదుట మరోసారి బైండు ఓవర్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత… గాంధీనగర్ కు చెందిన రౌడీషీటర్ కొండలను… తాసిల్దార్ ఎదుట ఒకటో పట్టణ పోలీసులు.. బైండోవర్ చేశారు
బెండ్ అవర్ చేసిన మరుసటి రోజే సాయి అనే యువకుడిపై.. దాడి చేశాడు…… సాయి ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధన అతిక్రమించినందుకు గాను… నిందితుడికి కో తాసిల్దార్. హరిబాబు ఎదుట హాజరు పరచడంతో లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించక పోతే ఆరు నెలలు జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. దీంతో కొండలు మంగళవారం జరిమానా చెల్లించారు. బెండవర్ నిబంధనలు ఎవరైనా అతిక్రమించినట్లయితే… కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాఘవేందర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శివతేజ… ఆర్ఐ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు