
*మిర్యాలగూడ ప్రజాలహరి…..మిర్యాలగూడ పట్టణంలో 200 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేశారు. గురువారం పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ 1 వ వార్డు ఇన్ ఛార్జీ పూనాటి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓబిసి సెల్ పట్టణ అధ్యక్షుడు కోల రామస్వామి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులు 200 మందిలో బిఆర్ఎస్ లో చేరారు. బిఆర్ఎస్ లో చేరిన వారందరికీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ కండువాలు వేసి స్వాగతించారు. కెసిఆర్ ప్రభుత్వం నేతృత్వంలో మిర్యాలగూడ లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును చూసి బీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.*