
కెసిఆర్ కు స్వాగతం సుస్వాగతం. మిర్యాలగూడ ప్రజాలహరి…. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ విచ్చేయుచున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మిర్యాలగూడ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన రాక సందర్భంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ నాయకుడు కు ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకోవాలని గ్రామ గ్రామo నుంచి తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఆయన చేసిన సేవలను మననం చేసుకుంటూ సభ వేదిక వద్దకు తరలిరావడానికి ప్రజలు తమ తమ వ్యక్తిగత వాహనాల్లో బయలుదేరుతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పి క్యాంప్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది స్వాగత తోరణాలతో ఏర్పాటు చేశారు. వీధి వీధుల్లో కేసీఆర్ ను మిర్యాలగూడ ఆహ్వానిస్తూ బ్యానర్లు ఆర్చీలు ఏర్పాటు చేశారు. తమ స్థానిక నేత ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు పేరిట బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సుమారు 6000 కోట్లతో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి చేసిన మరియు తెలంగాణకు తలమానికం అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు వెనుక భాస్కరరావు కృషి అమోఘమని ప్రజలు పేర్కొంటున్నారు. మహానేతకు ఈ విధంగానైనా కృతజ్ఞతలు భావిస్తున్నారు.