Ultimate magazine theme for WordPress.

విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేయాలి. భాస్కరరావు

Post top
home side top

*విజయమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పని చేయాలి మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి  నల్లమోతు భాస్కర్ రావు.

 

మిర్యాలగూడ ప్రజాలహరి

రానున్న సాదారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలనీ మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు గారు కోరారు, గురువారం మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్ లో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారి అద్వర్యంలో బి.ఆర్.ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ వార్డ్ ఇంచార్లులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు గారు పాల్గొన్నారు, ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ళలో మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రాంతాలు ఎంతో సుందరీకరంగా అభివృద్ధి చెందినదన్నారు, మున్సిపాలిటీ పరిదిలోని 48 వార్డ్లల్లో సి.సి రోడ్లు సోకర్యవంతంగా ఉన్నాయన్నారు, ప్రతి ఇంటికి మిషన్ భగీరధ మంచినీటి నల్లాలు ఏర్పాటు చేయడంతో మహిళలు చాల సంతోషంగా వ్యక్తం చేస్తున్నారుపట్టణంలోని ప్రధాన కుడలల్లో రోడ్లు వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు..తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అన్నిరితుల్లో పట్టణంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు, గత 10 ఏండ్లలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం పై క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని వివరించి కె.సి.ఆర్ ను ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిని చేయడానికి కారు గుర్తుపై ఓటు వేయించే విధంగా అంకితభావంతో పని చేయాలనీ పార్టీ శ్రేణులకు హితబోధ చేసారు..ఈ సమవేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్లు పాల్గొన్నారు….

post bottom

Leave A Reply

Your email address will not be published.