
మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన రేపాల మధుసూదన్ను శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు , తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి , నల్లగొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి ధనమల్లయ్య, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబి), మజ్జిగపు సుధాకర్ రెడ్డి, గార్లపాటి మధుసూదన్, రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు…