Ultimate magazine theme for WordPress.

క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేసిన సిద్ధార్థ

Post top
home side top

దామరచర్ల మండల కేంద్రం నందు తెలంగాణ క్రీడా ప్రాంగణ మైదాన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించగా డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ, జెడ్పీటీసీ అంగోతు లలిత హథీరామ్, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, శ్రీశ్రీశ్రీ మీనాక్షి ఆగేస్తేస్వర స్వామి ఆలయ చైర్మన్ కుందుటి సిద్దయ్య, గార్లతో కలిసి యువనేత నల్లమోతు సిద్దార్ధ పాల్గొని క్రీడా మైదానానికి శంకుస్థాపన చేసారు.. ఈ సందర్భంగా సిద్దార్ధ మాట్లాడుతూ ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, గ్రామీణ ప్రాంతాల్లో ఆట స్థలాలు లేక యువత క్రీడలకు దూరమవుతున్నారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నా సాధనకు అవకాశం లేకపోవడంతో ఎంతో మంది క్రీడాకారులు మరుగునపడిపోతున్నారు యువత తెలంగాణ క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు .. ఈ కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి కటికం సైదులు రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ డైరెక్టర్ కందుల నాగిరెడ్డి, ఎం.పి.టి.సి లు సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి సత్యనారాయణ, లక్కి సింగ్, కో-ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, సర్పంచ్లు లావురి శ్రీను నాయక్, సరోజా లింగా నాయక్, బంటు కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, బంగారు సైదిరెడ్డి, దామరచర్ల మండల యువజన విభాగం అధ్యక్షులు బైరం గోపి, షైక్ రఫీ, కొండారపు వీరసైదులు, నాగేశ్వర్ రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.