
మిర్యాలగూడ . ప్రజాలహరి,,. పంచాయతీరాజ్ శాఖ నిధులు 20 లక్షల రూపాయలతో మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం 80 లక్షల రూపాయలతో నిర్మితమవుతున్న 3 రోడ్ల నిర్మాణ పనులకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి తో కలిసి ఈరోజు శంకుస్థాపన చేసారు… అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలను ఆడపడుచులకు అందజేసారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సంక్షేమం కోసం సి.ఏం కె.సి.ఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది, కే.సీ.ఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి ఇప్పటి వరకు 13 కోట్ల 70 లక్షల 26 వేల 38 రూపాయలు మంజూరు అయ్యాయి అని తెలిపారు..ఈ కార్యక్రమంలో, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వేలిశెట్టి రామకృష్ణ, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, ఎం.పీ.డీ.ఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, సర్పంచ్ గజ్జల జయమ్మ కోటిరెడ్డి, బారెడ్డి అశోక్ రెడ్డి, ఎం.పి.టి.సి వేలిశెట్టి వీరవేణి, ఉపసర్పంచ్ బీసం వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అద్యక్షులు వంగాల వెంకట రెడ్డి, చదుర్ల శ్రీనివాస్, మద్దెల విక్టర్, మాజీ సర్పంచ్ చింతల వెంకటేశ్వర్లు, సప్పిడి చంద్రారెడ్డి, చిత్తల వెంకట్ రెడ్డి, కిరణ్, ఆదిమల్ల నగేష్, రాము, పంచాయత్ రాజ్ శాఖ అధికారులు, బి.ఆర్.ఎస్ నాయకులు, గ్రామప్రజలు పాల్గొన్నారు