
వేములపల్లి ప్రజాలహరి…నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా 7 కోట్ల 45 లక్షల రూపాయల వ్యయంతో వేములపల్లి మండలం సల్కునూరు గ్రామం నందు పాలేరు వాగుపై నిర్మించిన 2 చెక్ డ్యామ్ లను ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు… అనంతరం కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలకు చెందిన 60 మంది కార్యకర్తలు స్థానిక సర్పంచ్ అంకెపాక రాజు అద్వర్యంలో ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు, వారిని ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు, ఈ కార్యక్రమంలో ZPTC ఇరుగు మంగమ్మ వెంకటయ్య, మండల పార్టీ అద్యక్షులు, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి, సర్పంచ్ అంకెపాక రాజు, సాయిని సైదులు, ఎం.పి.టి.సి గడ్డం రాములమ్మ వెంకన్న, గ్రామ శాఖ అద్యక్షులు గడ్డం కృష్ణ, భారీ సైదులు, అనంతుల మోహన్ రెడ్డి, IB అధికారులు తదితరులు పాల్గొన్నారు…