
*జీ.ఓ 58 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
మిర్యాలగూడ ప్రజాలహరి
అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే జీ.ఓ 58 కింద మిర్యాలగూడ నియోజకవర్గం నందు 460 మంది పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్లోగల ARC గార్డెన్స్లో లబ్దిదారులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. అర్హులైనా ప్రతి పేదవారికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓ నెం.58, 59 పథకం ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికి పూర్తి హక్కు కల్పించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జి.ఓ నెం.58, 59 పథకం ద్వారా ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికే పూర్తి హక్కు ను ఈ జి.ఓ ల కల్పిస్తున్నది, ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్ పత్తిపాటి నవాబ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ పులి జగదీష్, కౌన్సిలర్లు బంటు రమేశ్, పశ్య శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఐల వెంకన్న, బొడ్డు నంద కిషోర్ యాదవ్, బల్లెం అయోధ్య, సాదినేని శ్రీనివాస్, వడ్డేపల్లి శ్రీనివాస్, గౌటే కనకయ్య, MRO, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు…