
మిర్యాలగూడ ప్రజాలహరి., నేత్ర చికిత్స , కంటి చూపు మనిషికి పునర్జన్మ తో సమానమని ఎం డి 320 జీఎస్టీ కో ఆర్డినేటర్ ఫాస్టెస్ట్ మల్టీ ఫుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ గోలి అమరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మిర్యాలగూడ రామచంద్ర గూడెం లో టీవీ కె రంగాచార్యులు, రంగనాయకమ్మ ల జ్ఞాపకార్థం నిర్మించిన లయన్స్ ఐ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూపు మందగించిన వారికి నేత్రం విలువ తెలుస్తుందని అటువంటి వారికి నేత్ర వైద్య సేవలు అందిస్తున్న మిర్యాలగూడ లయన్స్ బృందానికి తన ప్రత్యేక అభినందనలనీ చెప్పారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కి వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య పరీక్షలు అందించటం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంలో నేత్ర బాధితులకు ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ నిమిత్తం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆసుపత్రి కార్యదర్శి మొక్కపాటి వెంకటేశ్వరరావు నేత్ర బాధితులకు ఉచితంగా నిమిత్తం 3 లక్షలు ప్రకటించారు .మిర్యాలగూడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కర్నాటి రమేష్ మాట్లాడుతూ ఆసుపత్రి వసతులను మరియు అభివృద్ధి కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి డి జి లయన్స్ రామానుజాచార్యులు, లయన్స్ మెంబర్లు బండారు రామలింగం, ఎనగండ్ల లింగయ్య ,పాశం రవీందర్ రెడ్డి, కల్వకుంట్ల విజయకుమార్, డాక్టర్ రాజు, కంచర్ల అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు