
*మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన వెంకన్న గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. స్థానిక BRS నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకునిరాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు చికిత్స నిమిత్తం సీ.ఎం సహయనిది (LOC) ద్వారా 2,50,000 రూపాయలను మంజూరు చేయించారు. అట్టి LOCను ఈరోజు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ అందజేసారు.*