Ultimate magazine theme for WordPress.

మేఘాలయ సీఎంతో భేటీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్

Post top

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

 

ప్రగతి భవన్ చేరుకున్న మేఘాలయ సీఎం  సంగ్మాను ముఖ్యమంత్రి  కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

 

అనంతరం తేనీటి విందుతో ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సీఎంలు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. అనంతరం సీఎం  కేసీఆర్ శాలువాతో సీఎం  సంగ్మాను సత్కరించి, మెమొంటో బహూకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎంకు సీఎం  కేసీఆర్ వీడ్కోలు పలికారు.

 

ఈ సందర్భంగా మంత్రులు  కేటీఆర్,  హరీష్ రావు,  ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు  రాజేశ్వర్ రెడ్డి,  మధుసూదనాచారి, ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి  వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.