
సూర్యాపేటలో జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ యార్డు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనెల 20వ తేదీన ప్రారంభం
* మంత్రి జగదీశ్రెడ్డి కృషిని ప్రశంసిస్తున్న రైతులు
….. ప్రజాలహరి, సూర్యాపేట….
తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమీకృత మార్కెట్ యార్డుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ ఉత్పత్తుల రైతుల మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఆసియాలోనే ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును సూర్యాపేటలో నిర్మించారు. సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో భారతదేశంలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో యార్డును నిర్మించారు. మంత్రి జగదీష్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ మార్కెట్ యార్డు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. సూర్యాపేట మార్కెట్ యార్డు దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ మార్కెట్ యార్డు. 30 కోట్ల రూపాయలతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాకుల్లో 200 కంటే ఎక్కువ దుకాణాలు నిర్మించారు. దుకాణాలతోపాటు, రైతులకోసమే ప్రత్యేకంగా ఒక బ్యాంకు, సమావేశ మందిరం (బాంక్వెట్ హాల్), నిర్వహణ కార్యాలయం (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్), ఏటీఎం కేంద్రం, రైతులు, కొనుగోలుదారుల సౌకర్యార్థం క్యాంటీన్ ను కూడా నిర్మించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మొత్తం మార్కెట్ యార్డు భవనంలో రోజుకు 9 నుండి 10 గంటల పాటు స్కై షేడ్తో పగటి వెలుగులు ప్రసరించే మార్కెట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేటలోనే నెలకొల్పడం ఒక రికార్డు. స్కైలైట్ వల్ల విద్యుత్ దీపాల అవసరం ఉండదు. సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించడం వల్ల మొత్తం మార్కెట్ యార్డు భవనాల్లో రోజుకు 9 నుండి 10 గంటల పాటు విద్యుత్ దీపాల అవసరం ఉండదు. ఒక్క యూనిట్ కరెంటు కూడా వెలుతురు కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ యార్డు ప్రధాన భవనం ప్రపంచస్థాయి డిజైన్ తరహా కారిడార్లను కలిగి ఉంది. యార్డుకు రెండు వైపులా ఉన్న దుకాణాలు ఏసీలో ఉన్నట్లు చల్లగా ఉండేందుకు వీలుగా స్కై షేడ్లో వెంటిలేషన్ను ఏర్పాటు చేయడం ఇక్కడి మరో ప్రత్యేకత. మార్కెట్ యార్డులోని వాతావరణం గంటకు 25 సార్లు చల్లబరిచేలా ఈ తాజా కూలర్ వెంటిలేషన్ సిస్టమ్ దోహదపడుతుంది. దీంతో అక్కడి రైతులు, కొనుగోలుదారులు చల్లటి వాతావరణంతోపాటు తాజా గాలిని ఆస్వాదించవచ్చు.
ఆసియాలోనే ప్రతిష్టాత్మక మార్కెట్ : మంత్రి జగదీశ్రెడ్డి
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు వివిధ వ్యాపారులకు అనుగుణంగా ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేస్తున్న మార్కెట్ యార్డులన్నిటిలో సూర్యాపేట మార్కెట్యార్డు రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కూరగాయలు, పండ్లు, పూలు, మటన్ అన్నీ ఒకే చోట దొరికేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించామన్నారు.
ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా….
సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజు జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.