
మిర్యాలగూడ ప్రజాలహరి …………………..77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండాను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు ఆవిష్కరించారు. అనంతరం వెంకటాద్రిపాలెంలోని మదరసాలో, మున్సిపల్ కార్యాలయంలో, మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో మరియు RDO కార్యాలయంలో, అవంతిపురం వ్యవసాయ మార్కెట్ లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మార్కెట్ కమిటి చైర్మన్ సంపత్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, MPP నూకల సరళ హనుమంతు రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదులు, సీనియర్ నాయకులూ అన్నభిమోజు నాగార్జున చారి, పెద్ది శ్రీనివాస్, మదార్ బాబా, జొన్నలగడ్డ రంగారెడ్డి, సైదులు బాబు, DSP వెంకటగిరి, RDO చెన్నయ్య, MRO హరిబాబు, MPDO జ్యోతి లక్ష్మి, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.