
విలేకరుల పై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అని రోడ్డుపై నిరసన
వేములపల్లి ప్రజాలహరి..
మండల విలేకరులపై కొందరు దాడి చేసిన ఘటన వేములపల్లి మండలంలోని బుగ్గబాయ్ గూడెం శివారులో చోటుచేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని పలుమార్లు శాసనసభ సమావేశాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం విలేకరుల కు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మండల తహసిల్దార్ కి ఆర్జి పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ జర్నలిస్టులకు బుగ్గబాయి గూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలం లో రాళ్లతో కూడిన గుట్టను కేటాయిస్తున్నట్లు చెప్పడం జరిగింది.. ఈ నేపథ్యంలో తహసిల్దార్ చూపినటువంటి ప్రభుత్వ స్థలాన్ని గత మూడు రోజులుగా బాగు చేస్తున్నారు.. ఈ క్రమంలో శనివారం ఉదయం 8 గంటల సమయంలో ముగ్గురు విలేకరులు స్థలం వద్ద ఉండి జెసిబి టిప్పర్లతో పనులు చేపిస్తున్నారు. పలువురు అక్కడికి చేరుకొని ఈ స్థలం మా యాదవులది అని ముగ్గురు విలేకరులపై రాళ్లతో దాడి చేసి వారిష్టానుసారంగా కులం పేరుతో మాదిగ నా కొడుకుల్లారా అంటూ దూషించారు.. రాళ్లతో దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాకుండా విలేఖరిని చంపుతామని దీంతో భయంభ్రాంతులకు గురైన విలేకరులు పోలీస్ స్టేషన్ కి చేరుకొని మా పై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది…
*దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి*
విలేకరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న విలేకరులు అందరూ వేములపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు చేరుకొని రోడ్డుపై బేటాయించి రాస్తారోకో నిర్వహించారు… ఈ సందర్భంగా సీనియర్ విలేకరు ఆయుబ్ మాట్లాడుతూ… విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించినట్లుగా పత్రాలు జారీ చేస్తూ మరల ఇతరులతో దాడులకు దిగమని వారినీ ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు… ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తున్నటువంటి మా విలేకరులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.. నెలసరి జీతాలు లేకున్నా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియచేయడానికి అనునిత్యం విధులు నిర్వహిస్తుంటే కొంతమంది బెదిరింపులకు దాడులకు దిగడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరి భూములను ఆక్రమించలేదు ప్రభుత్వ నిబంధనలకు లోబడే మా ఇండ్ల స్థలాలపై పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే, తహసిల్దార్ చూపబడిన ప్రభుత్వ స్థలంలోనే బాగు చేసుకునే క్రమంలోనే కొంతమంది రాజకీయ నాయకులు మాపై దాడులకు పాల్పడమని చాలా బాధాకరమని అన్నారు.. ఈ కార్యక్రమంలో నజీమ్, అస్లాం, రంగ శ్రీను, నరేందర్ రెడ్డి, మనోజ్, వెంకన్న, మహేష్, నాగరాజు, నాగయ్య, హరి, నరేష్, చంటి, వీరయ్య, నాగయ్య, సైదులు, శ్రీను, రమేష్, నాగేష్, డీ. వెంకటేశ్వర్లు, శేఖర్, శ్రవణ్, నరసయ్య, సతీష్, సైదులు, భరత్, హరీష్, నాగరాజు, అంజి, తదితరులు పాల్గొన్నారు..