
ప్రభుత్వ కార్యాలయం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి తాసిల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏవీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాసిల్దార్ కార్యాలయంలో కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ నిర్మల దేవి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, కార్యాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు