
లోటస్ స్కూల్ చిన్నారులకు అంతర్జాతీయ స్వర్ణ నంది పురస్కారాలు …….. ………. ప్రజలహరి మిర్యాలగూడ. …ఆగస్ట్ 2 న హైదరాబాద్ రవీంద్ర భారతి లో శాంతి కృష్ణ సేవా సమితి హైదరాబాద్ వారు నిర్వహించిన అంతర్జాతీయ నృత్యోత్సవంలో మిర్యాలగూడ అశోక్ నగర్ లో గల లోటస్ స్కూల్ 9 వ తరగతి చదివే చిన్నారి గాయత్రి, ఏడవ తరగతి చిన్నారులు హైందవి, చిద్వి లాసినిలకు స్వర్ణ నంది పురస్కారాలు గెల్చుకున్నారు. తెలంగాణ గ్రామీణాభివృద్ది శాక మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,మాజీ ఐఏఎస్ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా స్వర్ణ నంది పురస్కారాలు అందుకోవడం జరిగింది. అదే విదంగా డిసెంబర్ 24 న హైదరాబాద్ లో జరిగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నృత్యోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాఠశాల చైర్మన్ బొడ్డుపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు తమ పాఠశాల ఎల్లవేళలా పనిచేస్తుందని పురస్కారం సాధించిన విద్యార్థులను సన్మానించి మిమ్మల్ని అందజేశారు