రాహుల్ గాంధీ అనర్హత కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంపై కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు

మిర్యాలగూడ ప్రజాలహరి… రాహుల్ గాంధీ గారి పై సత్య ఆరోపణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన కేసుపై సుప్రీంకోర్టులో స్టే వచ్చినందుకు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ చౌరస్తాలో బాణాసంచాను కాల్చి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిజాయితీ పరులను గుర్తిస్తుందని అందుకే రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టు పార్లమెంటు సమావేశాలకు హాజరుకోవటానికి అనుమతిని ఇచ్చిందని ఇలాంటి దొంగ మోడీలు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మరని రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీ దే అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని దొంగ కేసులు పెట్టిన నిజాయితీపరులైనటువంటి కాంగ్రెస్ నాయకులను వారు ఏమి చేయలేరని వారన్నారు
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ గారికి నీకు ఇష్టమైనప్పుడు పార్లమెంటు సమావేశాలకు అనుమతినివ్వడం హర్షించదగ్గ విషయమని దేశంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుండి జాతీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కేసులలో ఇరికించి కాంగ్రెస్ పార్టీ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని దురుద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారని వీరికి తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని వారన్నారు
పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టులో స్టే రావడం చాలా సంతోషించదగ్గ విషయమని నిజాయితీపరులకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందని అవినీతిపరులైన మోడీలను తిడితే అది మోడీ వంశానికి అందరికీ వస్తుందని దుష్ప్రచారాలు చేసి మా నాయకుడిని కించపరచాలని ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం దుష్టపన్నాగం పన్నిందని రాబోయే కాలంలో ఇటు తెలంగాణ అసెంబ్లీలో పార్లమెంట్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని వారన్నారు
జిల్లా ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు హజార్ ,కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, క్రికెటర్ జానీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సికిందర్, కాంగ్రెస్ నాయకులు మస్తాన్, పర్వేజ్ ఖాన్, శ్యాంసుందర్ రెడ్డి, దైదగిరి ,పసుపులేటి శేఖర్, సతీష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు