
తల్లితండ్రులను స్మరించుకోవడం గొప్ప విషయం:- మాజీ మంత్రి జానారెడ్డి
Prajala Hari… కని పెంచి పెద్దచేసి గొప్ప స్థాయిలో ఉండేలా కృషీ చేసిన తల్లిదండ్రులను స్మరించుకోవడం గొప్ప విషయమని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలంలోని కేతవత్ తండాలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తల్లిదండ్రులు కేతావత్ వీర్య నాయక్, హాస్య విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. తల్లిదండ్రుల కృషి వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో వున్నామని ప్రతిఒక్కరూ గుర్తు ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్,అమరేందర్ రెడీ, వీర కోటిరెడ్డి, నారాయణ రెడీ, మాజీ ఎంపిపి శంకర్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ్ నాయక్, స్కైలాబ్ నాయక్, రవితేజ, రవి, మేగ్యా నాయక్, మాన్య నాయక్, కిషన్ నాయక్, నానిక్య, భీమ్ల నాయక్,భాష, సైదా, చీన, వెంకన్న, శ్రీను నాయక్ తదితరుల పాల్గొన్నారు.