Ultimate magazine theme for WordPress.

10 లక్షల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Post top
home side top

(ప్రజాలహరి మిర్యాలగూడ) మండలంలో R&B రోడ్డు నుంచి సామ్య గాని తండ గ్రామం వరకు 68 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి మరియు శ్రీనివాస్ నగర్ గ్రామములో రూ. 10 లక్షల వ్యయంతో అంతర్గత CC రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి , MPP నూకల సరళ హనుమంతు రెడ్డి తో కలిసి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్బంగా MLA గారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా R&B రోడ్డు నుంచి సామేగాని తండ వరకు రోడ్డు నిర్మాణం తీవ్ర జాప్యానికి గురి అయిందని దానిని ఇప్పుడు సాకారం చేసుకోవడం జరుగుతుందని.. అదేవిధముగా ప్రజల కోరిక మేరకు సామేగాని తండా ను గ్రామ పంచాయతిగా కుడా చేసుకోవడం జరిగిందని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. నియోజక వర్గములో అన్ని గ్రామ పంచాయతిలలో మౌలిక సదుపాయాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి చేస్తానని MLA గారు తెలిపారు. కార్యక్రమములో మాజీ AMC చైర్మన్ చిట్టిబాబు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు భోగవిల్లి వెంకటరమణ చౌదరి, సర్పంచ్ ధనావత్ సైదా నాయక్, MPTC ఇస్లావత్ సుజాత బాలు నాయక్, చిలుకూరి సత్యనారాయణ, మాజీ AMC డైరెక్టర్ పులి జగదీష్, సైదా నాయక్, శ్రీహరి నాయక్, BRS మండల ప్రధాన కార్యదర్శి PCK ప్రసాద్, మాజీ MPTC వాసంశెట్టి గోవిందు, పంచాయతి రాజ్ శాఖ DEE ముత్తవరపు వెంకటేశ్వర రావు, AEE చిల్లంచర్ల ఆదినారాయణ, BRS పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.