శాంతినగర్ లో రోడ్లపైనే డ్రైనేజీ నీరు ఇబ్బందులు పడుతున్న ప్రజలు… ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ లో రహదారులు అద్వానంగా ఉన్నాయి. దానికి తోడు మురికి నీరు రోడ్లపైనే నిలువగా ఉంటున్నాయి. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. శాంతినగర్ లోని కనకదుర్గ గుడికి వెళ్లే దారిలో డ్రైనేజీ నీరు రోడ్డుపై ఉన్నది .ఈ ప్రాంతంలోనే మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇల్లు కూడా ఉన్నది. అయినా మున్సిపల్ అధికారులలో చలనం లేదు గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది .అయిన ఎవరు పట్టించుకోవటం లేదు. ఎన్ఎస్పి క్యాంప్, శాంతినగర్ ఏరియాలో చిన్న వాటి వర్షం వస్తే రోడ్లమీద వర్షపు నీరునిలుస్తుంది . మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా సర్వే చేసి రహదారులను మరమ్మత్తులు చేయడం, డ్రైనేజీలు లేని చోట డ్రైనేజీలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.