
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ… ప్రజాలహరి.. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 23 మంది లబ్ధిదారులకు 682,000 చెక్కులను మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు పంపిణీ చేశారు. ఈరోజు ఎస్వి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథం వ్యవహరిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదలకు దీర్ఘకాలిక రోగాలు వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుందని ఆ సందర్భంలో రోగుల కుటుంబాలకు చేయూతనివ్వడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ్ సింహ రెడ్డి ఎంపీపీ సరళ మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిట్టిబాబు రామకృష్ణ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు